శ్రీశ్రీ మహా ప్రస్థానం భారీ పుస్తకాన్ని అందించిన కొప్పర్తి రాంబాబు


వశిష్ఠ ప్రగతి (భగవాన్ న్యూస్), నరసాపురం:
నరసాపురం మండలం కొప్పర్రు గ్రామం పుస్తక పంపిణీ కేంద్రానికి ఆ గ్రామానికి చెందిన ఇండియన్ బ్యాంక్ విశ్రాంత ఏజీఎమ్  కొప్పర్తి రాంబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని  శ్రీ శ్రీ మహాప్రస్థానం భారీ పుస్తకాన్ని అందజేశారు.  ఈ సందర్భంగా రాంబాబు ఆధ్యాత్మికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా చేస్తున్న సేవలను లైబ్రేరియన్ కమల కుమారి కొనియాడారు. శేషజీవితంలో  సామాజిక మాధ్యమాలలో రూపొందించిన రామాయణం, మహాభారతం,  కథలను ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పోలిశెట్టి రమేష్ , చినమిల్లి వీరబాబు, నూకల రత్నాజి ,  కుంకటి చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.  శ్రీ శ్రీ మహాప్రస్థానం భారీ  పుస్తకాన్ని విజయవాడకు చెందిన  శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు సహకారంతో ముద్రించారమని, దీనిని చూసి చదవాలని కొప్పర్తి రాంబాబు కోరారు.

Comments

Post a Comment

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం